‘ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కరోనా వల్ల నా ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారింది. మీ అందరి ప్రేమాభిమానాల వల్ల బతికి బయటపడ్డాను. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. గొప్ప కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు రాజశేఖర్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకురాలు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలు. ఈ నెల 20న విడుదలకానుంది. గురువారం హీరో అడివి శేష్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘కుటుంబ ప్రేక్షకులందరికి నచ్చే కథాంశమిది. గతంలో రాజశేఖర్ చేసిన అక్కమొగుడు, సింహరాశి, గోరింటాకు సినిమాలు ఎలా ఆకట్టుకున్నాయో అదే స్థాయిలో ‘శేఖర్’ మెప్పిస్తుంది. ఎమోషనల్ జర్నీగా హృదయాల్ని కదిలిస్తుంది’ అని చెప్పింది. తమ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చేశామని..భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలు కూడా ఆకట్టుకుంటాయని శివాని రాజశేఖర్ పేర్కొ ంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.