‘ఓ నటిగా విభిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకొని సినిమాలు చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. నా మనసుకు దగ్గరైన లవ్స్టోరీలో నటించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది కృతిసనన్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో జోరు చూపిస్తున్నది. ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో అవకాశాన్ని సంపాదించుకొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె కథానాయికగా నటించిన ‘షెహ్జాదా’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి రీమేక్ ఇది.
కృతిసనన్ మాట్లాడుతూ ‘తెరపై స్వచ్ఛమైన ప్రేమను చూపించే కథలంటే బాగా ఇష్టం. సినిమా చూస్తే ప్రతి ఒక్కరి మనసులో పవిత్ర భావాలు కలగాలి. అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని పేర్కొంది. ‘ఆదిపురుష్’ సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని, పౌరాణిక ఇతిహాస కథలో భాగం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కృతిసనన్ పేర్కొంది.