Sharwanand | శర్వానంద్ (Sharwanand) హీరోగా.. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో శర్వాకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇది శర్వానంద్కు 35వ సినిమా. దాదాపు చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ప్రచారం మొదలుపెట్టనున్నారు. అయితే ఈ లోగ శర్వానంద్ మరో సినిమాకి పచ్చజెండా ఊపారు.
‘సామజవరగమన’తో మంచి విజయాన్ని అందించాడు దర్శకుడు అబ్బరాజు. శ్రీవిష్ణు సినిమాతో రూ.50 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్వించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు అబ్బరాజు. ఇటివలే ఆయన, శర్వానంద్ కు ఓ కథ చెప్పారు. శర్వాకి కథ నచ్చింది. ఇది ట్రైయాంగిల్ లవ్ స్టొరీగా ఉండబోతుంది.’సామజవరగమన’లానే ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ . మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
శ్రీరామ్ ఆదిత్య, శర్వ మూవీకి మనమే (Maname) టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శర్వానంద్ సినిమాతో కృతిశెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్పై వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.