ఈ సారి బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఎవరేం చేస్తారని అని అడిగిన ప్రశ్నకు సినిమా ఇండస్ట్రీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. ఓ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తాను అని మానస్ అన్నాడు. యాభై లక్షల్లో 25 అమ్మకు, 25 దీప్తికి ఇస్తాను.. నేను హైద్రాబాద్కు వచ్చినప్పటి నుంచి తను డబ్బు ఇస్తూనే ఉంది. అప్పుడు ఆ డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండే వాడిని కాదు అని షన్ను అన్నాడు. ఇక తనకు యాభై లక్షల వస్తే.. అందులో శ్రీహాన్ ఫ్యామిలీకి ఉన్న పది లక్షల అప్పు తీర్చేస్తాను అంది సిరి.
కొంత డబ్బును అమ్మకు ఇస్తాను. ఆ తరువాత కొంత డబ్బును బ్లైండ్ పీపుల్కు ఇస్తాను అని చెప్పింది సిరి. సువర్ణ భూమిలో వచ్చేదాన్ని అమ్మకే ఇస్తాను అని చెప్పింది. ఆ తరువాత షన్ను, రవి, కాజల్, ప్రియాంకలోంచి షన్ను సేఫ్ అయినట్టు ప్రకటించాడు. ఆ తరువాత బొమ్మలతో సినిమాల పేర్లు చెప్పే టాస్క్ను ఆడించారు. అందులో మానస్, సన్నీ, కాజల్, సిరి ఓ టీం.. మిగతా వాళ్లంతా మరో టీంగా ఉన్నారు. ఆటలు ఆడుతూ మధ్యలో మరొకరిని సేఫ్ చేశాడు నాగ్. ప్రియాంక సేఫ్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
మళ్లీ బొమ్మలు, సినిమా పేర్లను కనిపెట్టే ఆటను ఆడించాడు. ఆ తరువాత కళ్లకు గంతలు కట్టించి మరో ఆటను ఆడించాడు. కళ్లకు గంతలు కట్టుకొని గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్స్లో వెళ్లి కూర్చోవాలి. అలా చివరకు ఎవరు మిగులుతారో వారే విజేతలు అని నాగార్జున తెలిపారు. గేమ్ చాలా చురుకుగా ఆడిన సిరి విజేతగా నిలిచింది.