శుక్రవారం ఎపిసోడ్ లో షణ్ముఖ్ మదర్ కూడా వచ్చారు. ఆమె వచ్చి రావడంతో తన కొడుకుని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత కొడుకుతో కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. మార్నింగ్ డ్యాన్స్ చేయమని అన్నాను.. ఓ రెండు రోజులే చేశావ్.. మళ్లీ చేయడం లేదు.. అక్కడ అందరితో డ్యాన్స్ వేసి గుడ్ మార్నింగ్ చెబితే మాకు చెప్పినట్టు అనిపిస్తుంది అని షణ్ముఖ్ తల్లి పేర్కొంది. నా బాండ్ ఎవరితో బాగుంది.. రవితోనా? సిరితోనా? అని షన్ను అడుగుతాడు.
అందరితో ఉండు.. ఒకరితోనే ఉండకు. ఒక మూలకు వెళ్లి ఒకరితోనే ఉండకు అని క్లాస్ పీకేశారు. ఇక దీప్తి ఎలా ఉంది, నా గురించి అడిగిందా అంటే అంతా బాగున్నారు. నేను ఎలా ఆలోచిస్తున్నానో తాను అలానే ఆలోచిస్తుంది. నువ్వు గేమ్ బాగా ఆడు అని పేర్కొంది. ఇంట్లో ఎలా ఉంటున్నావో ఇక్కడ కూడా అలానే ఉంటున్నావ్ అని షన్నుకి భరోసానిచ్చారు.
సిరి వాళ్ల అమ్మ అలా అనేసింది.. అంటూ షన్ను చెప్పే ప్రయత్నం చేశాడు. నాకు అర్థం అవుతుంది.. దేని గురించి బాధపడకు.. అని షన్నుకి తల్లి ధైర్యాన్ని ఇచ్చింది. 85 రోజులు ఉన్నాం కదా? అంటూ షన్ను ఏదో చెప్పబోతాడు… నీ కోసం నువ్ ఆడు.. ఎవరు అలిగినా కూడా వెళ్లి ఎమోషనల్ అవ్వకు..నా షన్ను స్ట్రాంగ్ అని అని అనుకుంటాను.. అందరూ బాగున్నారు.. అందరితో ఉండు.. బాగా ఎంజాయ్ చేయ్.. అని షన్ను మదర్ చెబుతుంటే సిరి ఎంట్రీ ఇస్తుంది.
ఏంటి ఆంటి ఇంకేంటి సంగతులు అని అడిగేస్తుంది. గేమ్ గేమ్లా చూసుకోండి.. ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి.. అలగడం మానేయండి.. బాగా లేదు.. నవ్వుతూనే ఉండండి.. అప్పుడే బాగుంటుంది.. అని సలహా ఇస్తారు. ఇక రేపటి నుంచి బాగానే ఉంటాం.. వేరే చూస్తారు.. అని అంటారు. దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది.