సినిమా పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరు మరణవార్త నుండి కోలుకునేలోపే మరొకరు కన్నుమూస్తున్నారు. రీసెంట్గా బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) చెన్నైలో కన్నుమూశారు. ఈమె మొట్టి ఒళి టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నా రు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. . ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారు జామున బెంగుళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికితా పొందుతూ మరణించారు.
ఇక తాగాజా కన్నడ హాస్యనటుడు శంకర్ రావు (84) అనారోగ్యంతో సోమవారం ఉదయం బెంగళూరుతో కన్నుమూశారు. పాప పాండు సీరియల్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన మృతి కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో నెట్టింది. శంకర్ రావు మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ వంటి అన్ని రకాల సినిమా పరిశ్రమలలో వరుస మరణాల కారణంగా ఇండస్ట్రీ దుఖః సాగరంలో మునిగిపోతుంది.