Chiranjeevi | పందొమ్మిదేళ్ల క్రితం వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ చిరు ఫ్యాన్స్కు స్పెషల్. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. తెలుగులో కోట్లు కొల్లగొట్టింది. బాస్ కామెడీ టైటింగ్కు ఫ్యాన్సే కాదు సగటు అభిమాని సైతం ఫిదా అయ్యాడు. కాగా ఇప్పుడు అలాంటి టైప్ ఆఫ్ కామెడీనే భోళాశంకర్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు కాస్త మంచి అటెన్సన్ తీసుకువచ్చాయి.
కాగా ఈ సినిమా కోసం మెహర్ రమేష్ ప్రత్యేకించి కొన్ని సీన్లను ప్లాన్ చేస్తున్నాడట. శంకర్ దాదా ఎమ్బీబీఎస్ తరహాలోనే టైటింగ్ కామెడీని సృష్టించబోతున్నాడట. మేయిన్ ప్లాన్ సిస్టర్ సెంటిమెంట్తోనే సాగిన.. మెగాస్టార్ తాలుకూ కామెడీ పుష్కలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మెహర్రమేష్ చిరును స్టైలిష్ అవతారంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య మంచి కంబ్యాక్ ఇచ్చిన చిరు.. ఈ సినిమాతో దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
ఇక మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో సినిమా చేయలేదు. దాంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట. ఎలాగనై చిరుకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెళ్లెలుగా కనిపించనుంది.