Bheemlanayak | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం భీమ్లానాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ప్లే అందించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరి సినీ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా సొమవారం నుంచి మాత్రం ఈ సినిమా జోరు చాలా వరకు తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంపై కుమ్మరి కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో వాళ్ల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశం ఉందంటూ ఆంధ్రప్రదేశ్ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో రానా ఓ సన్నివేశంలో కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నడం..అనంతరం తన ప్రత్యర్థిపై దాడి చేస్తాడు. తాము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అటువంటి దాన్ని తన్నడం కుమ్మరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, ఈ సన్నివేశం తమను కించపరిచేలా ఉందని వివరించారు. కథానాయకులు, దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని శాలివాహన కార్పోరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.