Shahrukh Khan| బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఔదార్యాన్ని చాటుకున్నాడు. న్యూ ఇయర్ రోజును రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంజలీ సింగ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు షారుఖ్కు చెందిన ఎన్టీవో మీర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో యువతిని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లిన సంఘటన విధితమే. ఓ వైపు దేశమంతా 2023 నూతన సంవత్సరానికి స్వాగతం సంతోషంతో స్వాగతం పలుకుతుండగా.. అంజలి ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. అంజలి మృతితో కుటుంబంలో విషాదం అలుముకున్నది.
అయితే, అంజలియే కుటుంబానికి ఆధారం. ఈ పరిస్థితుల్లో యువతి మృతితో కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో షారుఖ్కు చెందిన మీర్ ఫౌండేషన్ ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఎంత మొత్తం విరాళంగా అందించారనే విషయం మాత్రం తెలియరాలేదు. షారుక్ తన తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ పేరుతో మీర్ ఫౌండేషన్ని స్థాపించాడు. ఈ ఎన్జీవో అట్టడుగు స్థాయిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నది. మహిళలకు సాధికారత కోసం పని చేస్తుంది. ఈ క్రమంలోనే అంజలి కుటుంబానికి చేయూతనందించింది. ఇదిలా ఉండగా.. అంజలి మృతి కేసులో విచారణ కొనసాగుతున్నది. న్యాయం చేయాలని కుటుంబం కోరుతున్నది.