Shah Rukh Khan Pathan movie | బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నుండి సినిమా రాలేదు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పఠాన్’. జాన్ అబ్రహం, దీపికా పదుకునే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘వార్’ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన షారుఖ్ పోస్టర్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
‘పఠాన్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా అత్యంత భారీగా నిర్మిస్తున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిం బ్యానర్లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఇక ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.