బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్కు గత ఏడాది బాగా కలిసొచ్చింది. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఓ అగ్ర హీరో కేవలం ఏడాది వ్యవధిలో మూడు భారీ విజయాలను సొంతం చేసుకోవడం అరుదైన విషమయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకొని కుటుంబంతో విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు షారుఖ్ఖాన్. అయితే ఆయన తదుపరి సినిమాల గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. దాంతో అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వారిని సంతృప్తిపరిచేలా ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేయడానికి షారుఖ్ఖాన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. గత కొద్ది రోజులుగా పలువురు దర్శకులు, రచయితలతో వరుస భేటీలు నిర్వహిస్తూ స్క్రిప్ట్లను ఓకే చేసే పనిలో ఉన్నారట షారుఖ్ఖాన్. మూడు భిన్న జోనర్స్ కథలను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని, ఈ నెలాఖరులో భారీ ప్రకటన ఉంటుందని షారుఖ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ మూడు చిత్రాల్లో ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నదని, మరో చిత్రం మాత్రం ‘డంకీ’ తరహాలో సందేశంతో కూడిన ఫీల్గుడ్ ఎంటర్టైనర్ అని సమాచారం.