అనారోగ్య కారణాలతో ఇటీవల కన్నుమూసిన సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ సంతాప సభను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ…‘చిత్ర పరిశ్రమలో పది మంది మంచి కోసం పాటుపడిన వ్యక్తి ఎ.సూర్యనారాయణ గారు. ఆయనతో నాకు 30 ఏండ్ల అనుబంధం ఉంది. సూర్యనారాయణ గారు లేకుంటే నిర్మాతల మండలికి మూవీ టవర్స్ దక్కేది కాదు. ఆయన కెరీర్ మొత్తంలో ఎలాంటి వివాదాలు లేవు. అజాత శత్రువుగా ఇండస్ట్రీలో అందరితో మంచిగా మెలిగారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.