సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) సోమవారం రాత్రి హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. 1968లో ‘హిందూ’ దినపత్రికలో కెరీర్ ప్రారంభించిన ఆయన ‘ఈనాడు’తో సహా పలు పత్రికల్లో పనిచేశారు. సినీ విశ్లేషకుడిగా తనదైన ముద్రను వేశారు. వందలాది సినీ సమీక్షలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
దాదాపు 55 ఏళ్ల పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా విశేషమైన సేవలందించారు. ఫిల్మ్ క్రిటిక్స్ అధ్యక్షునిగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’అనే పుస్తకాన్ని రచించారు. గుడిపూడి శ్రీహరి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు సినీ జర్నలిజానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.