Actress Shobhana | మహేష్బాబు ప్రస్తుతం త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ తర్వాత ఈ కాంబో మూడో సారి జతకట్టడంతో అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. అయితే గత కొన్ని రోజులు ఈ సినిమా కాన్సిల్ అయిందంటూ పలు వార్తలు వచ్చాయి. వాటికి నిర్మాత స్పందించి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలిపాడు. కాగా త్రివిక్రమ్ కొత్తగా కథలో కొన్ని మార్పులు చేశాడని సమాచారం. ఇక త్రివిక్రమ్ మామూలుగా తన సినిమాల్లో భారీ కాస్టింగ్ను ఎంచుకుంటుంటాడు. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్లను, సీనియర్ హీరోలను తన సినిమాల్లో కీలకపాత్రల్లో నటింపచేస్తుంటాడు.
తాజాగా మరో సీనియర్ నటిని కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఎవరా సినీయర్ నటి అనుకంటున్నారా ఆమె మరోవరో కాదు శోభన. ఒకప్పుడు శోభన దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందింది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస ప్రాజెక్ట్లతో బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా త్రివిక్రమ్ SSMB28లో కీలకపాత్ర కోసం ఈమెను సంప్రదించాడట. ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.