Actor Murali Mohan | తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో మురళీ మోహన్ది ఓ ప్రత్యేక పేజీ. సరిగ్గా 5 దశాబ్దాల క్రితం జగమే మాయ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మురళీ మోహన్. 80, 90 దశకాల్లో అగ్ర హీరోలలో ఒకరిగా నిలిచాడు. ఇక హీరోగా, సహాయ నటుడుగా దాదాపు 350కు పైగా సినిమాలు చేశాడు. తన సుధీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో బంపర్ హిట్ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి క్రమంగా సినిమాలకు దూరం అయ్యాడు. ప్రస్తుతం అడపా దడపాగా సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య మురళీ మోహన్ పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు.
కాగా తాజాగా మురళీ మోహన్ ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తిర విషయాన్ని చెప్పాడు. శ్రీదేవితో తనకు పెళ్లి చేయాలనుకున్నట్లు మురళీ మోహన్ తెలిపాడు. మురళీ మోహన్ను చూసిన శ్రీదేవి వాళ్ల అమ్మ.. అబ్బాయి బాగున్నాడు, మన అమ్మాయికి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అని ఆమె చెప్పినట్లు మురళీ మోహన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో జయచిత్రతో ఎఫైర్ విషయం ఏంటని యాంకర్ అడుగగా.. మేం ఇద్దరం కలిసి ఫస్ట్ మూవీ ‘యవ్వనం కాటేసింది’ చేశాం. నా చేయి పట్టుకుని మీరు పెళ్లి చేసుకుంటున్నారా అని తను అడిగిందని మురళీ మోహన్ తెలిపాడు. అయితే ఇప్పుడు ఆమె ఎవరో గుర్తు లేదు. అంతకు మించి ఏం లేదు అని ఆయన చెప్పుకొచ్చాడు.