స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన స్కామ్ 1992 కొత్త రికార్డును సొంతం చేసుకుంది. హన్సల్ మెహతా డైరెక్షన్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఇండియాలో ఆల్టైమ్ మోస్ట్ పాపులర్ షోగా నిలిచింది. గతేడాది అక్టోబర్లో సోనీ లివ్లో వచ్చిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఐఎండీబీ రేటింగ్స్లో పదికి గాను 9.6 రేటింగ్తో టాప్ పొజిషన్ను సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని ఆల్టైమ్ పాపులర్ షోలలో ఒకటిగా స్కామ్ 1992 నిలిచింది. ప్రపంచంలోని 250 అత్యుత్తమ టీవీ షోలు, వెబ్ సిరీస్లలో దీనికి స్థానం దక్కింది. 1992లో స్టాక్ మార్కెట్ను కుదిపేసిన హర్షద్ మెహతా స్కామ్ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు హన్సల్ మెహతా. అతని కథనం కట్టిపడేసింది. హర్షద్ పాత్రలో ప్రతీక్ గాంధీ జీవించేశాడు.
ఇప్పుడీ షో ఇండియాలో బెస్ట్ ఆల్టైమ్ షోగా నిలిచిన తర్వాత ప్రతీక్ గాంధీ దీనిపై స్పందించాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఓ టీమ్గా మా కళపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతమైంది. అలాంటి అరుదైన జాబితాలో ఇండియా నుంచి స్కామ్ మాత్రమే నిలవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. స్కామ్ 1992 తన కెరీర్ను మలుపు తిప్పిందని, ఇప్పుడు ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల నుంచి తనకు అవకాశాలు వస్తున్నాయని ప్రతీక్ చెప్పాడు. స్కామ్ 1992తోపాటు ఈ లిస్ట్లో బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్, బ్రేకింగ్ బ్యాడ్, ద వైర్, చెర్నోబిల్ ఉన్నాయి.