సత్యం రాజేశ్ కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకుడు. మోగుళ్ల చంద్రశేఖర్రెడ్డి నిర్మాత. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సినిమా ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. నటుడు ప్రియదర్శి ఈ వేడుకకు అతిధిగా హాజరై ట్రైలర్ని లాంచ్చేసి, చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ‘నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడమేంటి?’ అని పోలీస్ఆఫీసర్ గెటప్లో ఉన్న ఎస్తేర్ ప్రశ్నించగా, ‘రావణాసురుడు సీతని చెరబడితే.. శిక్ష సీతకెందుకు పడింది?’ అని సత్యం రాజేశ్ ఎదురు ప్రశ్నించడం ట్రైలర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.
‘ఈ కథను యుగంధర్ ఎంత అద్భుతంగా చెప్పాడో, అంతే అద్భుతంగా మలిచాడు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ైక్లెమాక్స్లో కన్నీళ్లు వచ్చాయి. నిర్మాత సినిమాను ప్రేమించి చేశారు. నటీనటులంతా పోటీపడి నటించారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు. స్త్రీలకు బాగా కనెక్టయ్యే కథ ఇదని, నిర్మాతలోని రాజీలేని గుణం సినిమా బాగా రావడానికి దోహదపడిందని, సాంకేతికంగా అన్ని విభాగాలూ ఆకట్టుకుంటాయని దర్శకుడు చెప్పారు. ‘బలగం, కాంతారా చిత్రాల్లా సహజత్వంతో కూడుకున్న సినిమా ఇది. ఇందులో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి.’ అని నిర్మాత తెలిపారు.