సత్యం రాజేష్, డా॥ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మా ఊరి పొలిమేర’ సినిమా సీక్వెల్ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. గౌరికృష్ణ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని, అందరిని ఆకట్టుకునే వినూత్నమైన కథ ఇదని చిత్రబృందం పేర్కొంది.