Sasivadane Movie | ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే. కోమలీ ప్రసాద్ కథనాయికగా నటిస్తుంది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కుతుండగా.. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్లుక్తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా టీజర్ను ఈరోజు సాయంత్రం 5.01 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రఘు కుంచె, ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో పోషిస్తుండగా.. గౌరీ నాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిలిం కంపెనీతో కలిసి అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. శశివదనే విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Are You Ready to Embrace the beautiful Godavari Love tale❤️#Sasivadane Teaser Releasing Today at 5:01PM 🤩@RakshitAtluri @KomaleePrasad @ahiteja @Gauri_Naidu @sarva_vasudevan @shriesaidaara @UbbanaSaiMohan @Agfilmcompany #AbhilashReddy @MediaYouwe @beyondmediapres pic.twitter.com/g8btINaFR8
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2024