Sarkaruvaari paata | సూపర్ స్టార్ మహేష్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట. గీతా గోవిందం ఫేం పరుశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. కీర్తీసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటుంది. మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో మహేష్బాబు మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా మహేష్బాబు ఒక భారీ యాక్షన్ ఫైట్ను చేస్తున్నట్లు ఈ పోస్టర్లో ఉంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని స్వర పరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కళావతి పాట యూట్యుబ్లో 5.5 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుని రికార్డులను సృష్టిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.