Sarkaru Vaari Paata | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ‘గీతాగోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ గతంలోనే ప్రారంభమైంది. కరోనా కారణంగా కొన్ని సార్లు వాయిదా పడగా, మహేష్ షూటింగ్లో గాయపడి కొన్ని రోజులు షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని మే 12న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం.
యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగలో భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందట. ఇక నైజాంలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు కొనుగోలు చేశారట. ఇక ఆంధ్రరాష్ట్రంలో 50కోట్ల మేర బిజినెస్ జరిగిందట. మొత్తంగా రెండు తెలుగు రాష్రాల్లో కలిపి 80కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే విడుదలైనా ‘కళావతి’, ‘పెన్నీ’ సాంగ్స్ యూట్యూబ్లో మంచి వ్యూస్ను సాధిస్తున్నాయి.