నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్లో దిల్రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ చిత్రానికి ఊహించని ప్రత్యేకతలు తోడవుతున్నాయ్. ఇందులో కథానాయికగా ‘కాంతారరా’ఫేం సప్తమీ గౌడ ఎంపికైనట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ‘కాంతార’ కథానాయికగా సప్తమికి మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడామె డైరెక్ట్గా తెలుగు సినిమా చేయనుంది. ఇందులో ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.
అగ్ర నిర్మాణ సంస్థలో అవకాశం రావడంతో తెలుగులో తన కెరీర్కు ఈ చిత్రం శుభారంభాన్నిస్తుందనే ధీమాతో ఉందట సప్తమీ గౌడ. ఇక దిల్ రాజు సంస్థకూ నితిన్కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ‘దిల్’తోనే దిల్రాజు నిర్మాతగా మారారు. 21ఏళ్ల విరామం తర్వాత దిల్ రాజు సంస్థలో నితిన్ నటించడం విశేషం. ఎంసీఏ, వకీల్సాబ్ సినిమాల తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలే ఉన్నాయ్.