బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్దత్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’లో ప్రతినాయకుడిగా నటించిన ఆయన ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’లో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ‘అఖండ-2’ చిత్రంలో కూడా సంజయ్దత్ విలన్గా నటించే అవకాశముందని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇదిలావుండగా ఆయన మరో తెలుగు చిత్రానికి ఓకే చెప్పారని, అందులో కూడా ప్రతినాయకుడిగానే కనిపించనున్నారని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా ‘సంబరాల ఏటిగట్టు’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కేపీ రోహిత్ దర్శకుడు. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సంజయ్దత్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవలే దర్శకుడు ఆయన్ని కలిసి కథ చెప్పారని, తన పాత్రలోని కొత్తదనం నచ్చడంతో సంజయ్దత్ ఈ ప్రాజెక్ట్కు అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది.