సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’.యాక్షన్ గ్రూప్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్కే ఫిలింస్ సహకారంతో నిర్మిస్తున్నారు. సబాని నిర్మాత. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 8న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ…‘మా చిత్ర టైటిల్లోనే కొత్తదనం ఉంది. తర్వాత సీన్ ఏంటనే ఆసక్తి రేపుతుంది. సైన్స్ ఫిక్షన్ కథలో భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుంటుంది.’ అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..‘ఖమ్మం, విజయవాడ, వైజాగ్లో ఇటీవల మా చిత్ర ప్రివ్యూ షోస్ వేశాం. అందరి దగ్గర నుంచి మంచి స్పందన వస్తున్నది. మా సంస్థకు మరో విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అప్సర్ పాల్గొన్నారు.