Bala Krishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..నటి సంయుక్తతో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన బాలయ్య తన తాజా చిత్రం అఖండ 2 గురించి కూడా మాట్లాడారు. మూవీ నిర్మాణం పూర్తి అయిందని, చిత్రం చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. ఇటీవలే విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు.
అయితే బాలయ్యని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కాగా ఈ సందర్భంగా బాలకృష్ణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది సంయుక్తమీనన్. బాలయ్య ఆమెను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. వేరే వారితో బాలయ్య మాట్లాడుతుండగా, వెనక నుండి బాలయ్య కాళ్లు మొక్కింది సంయుక్త.. ఆ సమయంలో బాలయ్య ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ మధ్య బాలయ్య హవా ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, హోస్ట్ గా అదరగొడుతున్నారు. కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్న బాలయ్య వరుస విజయాలు అందుకుంటున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు నందమూరి నటసింహం. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టిన బాలయ్య ఇప్పుడు అఖండ 2 చిత్రంతో సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు నందమూరి బాలయ్య.
Back to Hyderabad ❤️❤️ pic.twitter.com/H4AjkWRqlE
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) June 13, 2025