Actress Samyuktha Menon | ప్రస్తుతం టాలీవుడ్లో సంయుక్త మీనన్ ఫీవర్ నడుస్తుంది. పట్టిందల్లా బంగరమే అన్నట్లు ఆమె తెలుగులో చేసిన నాలుగు సినిమాలు బంపర్ హిట్లే. దాంతో ఈ అమ్మడుని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అంటూ వర్ణిస్తున్నారు. ఇటీవలే విరూపాక్షతో ఈ మలయాళ బ్యూటీ తిరుగులేని విజయం సాధించింది. అందం, నటనతో పాటు మంచి మనసున్న వ్యక్తిగానూ సంయుక్త మీనన్ చాటిచెప్పింది. తాజాగా తెలుగులో ఓ రియాల్టిషోలో పాల్గొన్న సంయుక్త ఇద్దరు స్టూడెంట్స్కు మర్చిపోలేని గిఫ్ట్లను ఇచ్చింది.
విరూపాక్ష టీమ్తో కలిసి సంయుక్త మీనన్ తాజాగా సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. కాగా అన్ని టాస్క్లు గెలిస్తే స్కూటీ ఇస్తామని ఓంకార్ చెప్పాడు. అయితే విరూపాక్ష టీమ్ ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న స్టూడెంట్స్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం అని చెబుతారు. ఆ గేమ్లో గెలవడంతో సంయుక్త మీనన్ అక్కడున్న స్టూడెంట్స్లో ఇద్దరిని సెలక్ట్ చేసి అందులో ఒకరికి స్కూటీని ఇచ్చేసింది. ఇక మరో అమ్మాయికి స్కూటీ కొనిస్తానని చెప్పింది. దాంతో స్టూడెంట్స్ సంయుక్తను హగ్ చేసుకుని థాంక్యూ చెప్పారు.
దీనిపై పలువురు నెటిజన్లు బ్యూటీ విత్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే సంయుక్త.. విరూపాక్ష దర్శకుడు ఫోన్ పోగొట్టుకుంటే అతనికి ఐఫోన్ బహుమతిగా ఇచ్చింది. ఇక సంయుక్త ప్రస్తుతం డెవిల్ సినిమా చేస్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక విరూపాక్షతో సంయుక్తకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో నటిగా ఓ మెట్టు ఎక్కింది. ఇప్పటికే రూ.70 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఫైనల్ రన్లో మరో పది, పదిహేను కోట్లు వెనుకేసుకునే చాన్స్ ఉంది.