టాలీవుడ్ ఆన్స్క్రీన్ సక్సెస్ఫుల్ పెయిర్స్లో ఎన్టీఆర్, సమంత ఒకటి. ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్ హీరోయిన్గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ జంట తెరపై కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నాయికగా సమంతను సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. ముందు ఆలియా భట్ను హీరోయిన్గా అనుకున్నా…కుదిరేట్లు లేదు. దీంతో సమంతకే ఈ అవకాశం దక్కేలా కనిపిస్తున్నది. ప్రస్తుతం స్క్రిప్ట్ తుది దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్లో సెట్స్ మీదకు వెళ్లనుందట.