నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్మీడియాలో చేస్తున్న పోస్ట్లు తాత్విక చింతనతో కనిపిస్తున్నాయి. తన అంతరంగంలోని ఆశనిరాశలను ప్రతిబింబించేలా కవితాత్మక భావాలతో కూడిన కోట్స్ను తరచుగా షేర్ చేస్తున్నదామె. వాటిలో కొన్ని పోస్ట్లకు ‘మా అమ్మ చెప్పింది’ అనే హాష్ ట్యాగ్ను జత చేయడం విశేషం. దీంతో చాలా మంది అభిమానులు.. నిజంగా ఆ మాటలు చెప్పింది మీ అమ్మేనా? అని సమంతను సోషల్మీడియా వేదికల్లో ప్రశ్నిస్తున్నారట. ఈ విషయంపై స్పష్టత నిస్తూ అమ్మతో తాను చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను పంచుకుంది సమంత. అందులో ఆమె తల్లి పంపించిన ఓ కొటేషన్ కనిపిస్తున్నది. తాజా పోస్ట్ ద్వారా అమ్మ చెప్పే మాటల్నే తాను సోషల్మీడియాలో పంచుకుంటున్నానని సమంత క్లారిటీ ఇచ్చిందని ఆమె అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే చిత్రీకరణ పూర్తయింది.