సోషల్మీడియా వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలుంటాయని చెప్పింది సమంత. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ట్రోల్స్పై తాను మాట్లాడాల్సివస్తే ఆ మాటలు మౌనంకంటే బలంగా ఉండాలని తెలిపింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సినీ కెరీర్పై సీరియస్గా దృష్టిసారిస్తున్నది సమంత. తెలుగు, తమిళంతో పాటు హిందీలో సినిమాల్ని అంగీకరిస్తున్నది. తన భవిష్యత్ ప్రణాళికలతో పాటు కెరీర్ గురించి సమంత మాట్లాడుతూ ‘సోషల్మీడియాలో వచ్చే కామెంట్స్ను నేను పట్టించుకోను. మాట్లాడటం కంటే కొన్ని సార్లు సైలెంట్గా ఉండటమే బాగుంటుంది. సమాధానం చెప్పాల్సి వస్తే అది మౌనం కంటే బలంగా ఉండాలి. ఆ రోజు మాట్లాడతా. తొలినాళ్లలో నాలో ఉన్న భయాల వల్ల పాత్రలు, కథాంశాల పరంగా ప్రయోగాలు చేయలేదు. గత ఐదేళ్లుగా నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నా. సవాళ్లను ధైర్యంగా స్వీకరించడం అలవర్చుకున్నా. నేను నటించిన సినిమాల్ని స్క్రీన్పై చూడను. నా సినిమా వస్తుందంటే టీవీ ఆపేస్తాను. నన్ను నేను స్క్రీన్పై చూసుకుంటే తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో హిందీ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా దక్షిణాదిలో బిజీగా ఉండటంలో అంగీకరించలేకపోయాను. ‘ఫ్యామిలీమ్యాన్-2’ విజయం బాలీవుడ్ సినిమాలు చేసేలా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని తెలిపింది.