మోస్ట్ క్రేజీ కపుల్గా ఉండే సమంత-నాగ చైతన్య వివాహ బంధానికి అక్టోబర్ 2న తెరపడిన విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయిన విషయాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సమంత తన ఆ జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసి తీర్థయాత్రలకు వెళుతుండగా,చైతూ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
అయితే విడాకుల ప్రకటన తర్వాత సామ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి చైతన్యతో కలిసి ఉన్న దాదాపు 80 చిత్రాలను తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ – పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలను కాకుండా..ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే మెల్లగా తొలగిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజులలో వాటిని పూర్తిగా తొలగిస్తుందని చెబుతున్నారు.
ఫొటోలు మొత్తం డిలీట్ చేశాక నాగచైతన్య ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తుందేమో చూడాలి. రీసెంట్గా సమంత తన మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ,స్టైలిస్ట్ జుకల్కర్ ప్రీతమ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ముగ్గురూ విమానాశ్రయంలో తన లగేజ్ తో కనిపించారు. దుబాయ్ ట్రిప్ కి వెళుతున్నట్టు సమాచారం.