‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఆ తర్వాత వరుస సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్ట్లతో మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆర్మాక్స్ మీడియా టాప్-10 సెలబ్రెటీస్లో బాలీవుడ్ క్వీన్లను వెనక్కు నెట్టి సమంత మరోసారి మొదటి స్థానంలో నిలిచింది.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే జూలై నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ ఫీ మేల్ స్టార్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్లో సమంత టాప్ ప్లేస్లో నిలిచింది. సమంత తర్వాత ఆలియాభట్, నయనతార, కాజల్ అగర్వాల్ ఇలా పలువురు స్టార్ హీరోయిన్లు ఉన్నారు. మే నెలలో కూడా సమంతనే టాప్ ప్లేస్లో ఉంది. ఇక హీరోలలో థలపతి విజయ్ మొదటి స్థానంలో ఉండగా ప్రభాస్ రెండవ స్థానంలో ఉన్నాడు.
సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తుంది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. దీనితో పాటుగా ‘యశోదా’ అనే మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తుంది. సై-ఫై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటుగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తుంది.