సమంత కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య నుండి విడిపోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత సమంత పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో కథనాలు వచ్చాయి. అన్నింటిని ఓపికగా భరిస్తూ ముందుకు సాగుతుంది సమంత. అయితే సమంత కొద్ది రోజుల ముందే పౌరాణిక చిత్రం “శాకుంతలం” సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ మరి కొద్ది రోజులలో విడుదల కానుంది.
ఇక తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అందులో నయనతార కూడా కీలకపాత్రలో నటిస్తోంది. అయితే దసరా పండుగ రోజున సమంతకి సంబంధించిన పలు ప్రాజెక్టులకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందంటూ జోరుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె నెక్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. సామ్ తన తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.
కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్తో ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.