Samantha | టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గడచిన ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి వీరి పర్సనల్ లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. తాజాగా సమంత తీసుకున్న ఒక నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.సమంత తన ఇంటి పేరును మరోసారి మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెళ్లి తర్వాత మహిళలు తమ పేర్లలో భర్త పేరు చేర్చుకుంటారు. సమంత కూడా అక్కినేని నాగచైతన్యతో వివాహం తరువాత తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకుంది. కానీ విడాకుల తర్వాత మళ్లీ ‘సమంత రూత్ ప్రభు’గా మార్చుకుంది.
ఇప్పుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో, భర్త పేరును తన పేరు చివర చేర్చాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఆమె అధికారికంగా ‘సమంత నిడిమోరు’గా మారింది.సమంత ప్రస్తుతం నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’లో ఈ కొత్త పేరు ప్రేక్షకులకు పరిచయం చేయబడనుంది. ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నా, రాజ్ నిడిమోరు క్రియేటర్ అండ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, టైటిల్ కార్డ్స్లోనే సమంత పేరును ‘సమంత నిడిమోరు’గా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి.
మొత్తానికి, భర్తపై తన ప్రేమను ప్రదర్శిస్తూ, సమంత ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం ఆమె అభిమానులకు హర్షం కలిగించిందని సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది. కొత్త సినిమాతో పాటు తన కొత్త పేరు ద్వారా సమంత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.