Samantha | సమంత ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆరోగ్య సమస్యలతో పోరాడి కోలుకున్నది. అప్పటి నుంచి నిత్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ వస్తున్నది. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు దైవారాధనలో పాల్గొంటున్నది. ఈ క్రమంలో సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లింగ భైరవిదేవి అమ్మవారి ఎదుట ధాన్యం చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా ఓ ఆసక్తికర క్యాప్షన్ను జత చేసింది.
‘జీవితంలో నమ్మకమే ప్రధానమైన బలం. దీనికి అతీంద్రియ శక్తి అవసరం లేదు. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు.. నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘కొన్నిసార్లు దీనికి అతీంద్రియ శక్తి అవసరం లేదు. విశ్వాసం మీకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాసం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. విశ్వాసం మీ గురువు, మీ స్నేహితుడు అవుతుంది. విశ్వాసం మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ క్రమంలో పలువురు అభిమానులు ఆమెపై ప్రేమను కురిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సైతం స్పందించింది. సమంత వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లుగా ‘అవును’ కామెంట్ పెట్టింది. అనుష్క శర్మ సైతం తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఇటీవల దేవాలయాలు, ఆధ్మాత్యిక ప్రదేశాలను సందర్శించిన విషయం తెలిసిందే. సమంత చేస్తున్న ధ్యానం ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టియన్ కదా? హిందూ మతంలోకి ఎప్పుడు మారారంటూ పలువురు కామెంట్స్ పెట్టగా.. మరికొందరు ఆమె ఏ మతాన్ని అనుసరిస్తున్నారనేది పట్టింపు లేదంటూ మరికొందరు స్పందించారు.
భైరవి దేవి మీకు సమస్యలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుందని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. గతేడాది సమంత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మైయోసిస్తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్నది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉండగా.. మళ్లీ సెట్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో సమంత ‘ఖుషి’ సెట్స్లో మెరిసింది. హీరో విజయ్ దేవరకొండతో పాటు బృందం కేక్ కట్ చేసి ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరో వైపు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం నటించగా.. సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది.