Samantha Rutu Prabhu | మయోసైటిస్ వ్యాధి నుండి వేగంగా కోలుకుంటున్న సమంత మళ్లీ షూటింగ్లతో బిజీ అయిపోడానికి రెడీ అయింది. తాజాగా ఈ బ్యూటీ రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ‘సిటాడెల్’ ఇండియన్ స్పై సిరీస్ షూటింగ్లో జాయిన్ అయింది. ఈ మేరకు చిత్రబృందం సమంత లుక్ను కూడా రిలీజ్ చేశారు. స్టైలిష్ కాప్గా సమంత లుక్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్ సమంతను ట్యాగ్ చేస్తూ మరీ ‘ఖుషీ’ సినిమా సంగతేంటి అని ట్వీట్ చేశాడు.
దానికి సమంత త్వరలోనే ‘ఖుషీ’ సినిమా పున:ప్రారంభం అవుతుంది. విజయ్ అభిమానులకు నా క్షమాపణలు తెలియజేస్తున్నా అంటూ రౌడీ ఫ్యాన్ ట్వీట్కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కాగ గతకొంత కాలంగా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన సామ్.. సిటాడెల్ వెబ్సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతలం’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పునలు కూడా పూర్తి చేసుకుంది.
కాగా మొదట ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకుంటే ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు. కాగా గతవారం రిలీజై ‘పఠాన్’ సునామీ ఇప్పట్లో తగ్గేలా లేదు. మరో నెలరోజుల వరకు పఠాన్ హడావిడే కొనసాగుతుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కార్తిక్ ఆర్యన్ ‘షెహజాదా’ ఫిబ్రవరి 17కు పోస్ట్ పోన్ అయింది. దాంతో ‘శాకుంతలం’ సినిమాకు ‘షెహజాదా’ కూడా అడ్డయింది.
ఇక ఇప్పుడున్న పరిస్థుతుల్లో సోలోగా రావడమే బెటర్ అని చిత్రబృందం భావిస్తుందట. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అవడంతో కాస్త టెన్షన్ పడుతున్నారట. అంతేకాకుండా రిలీజ్కు పట్టుమని 20 రోజులు కూడా లేదు. ఈ లోపు అన్ని భాషల్లో ప్రమోషన్లు చేయాలంటే కుదరినిపని. దాంతో శాకుంతలాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023