సల్మాన్ ఖాన్ నటించిన కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’. పూజా హెగ్డే నాయికగా నటించింది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించగా..ఓ పాటలో అతిథిగా మెరిశారు రామ్ చరణ్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజు వసూళ్లు నిరాశపర్చాయి. దేశవ్యాప్తంగా తొలి రోజు నెట్ కలెక్షన్ 15 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇది సల్మాన్ గత చిత్రాల తొలి రోజు వసూళ్లతో చూస్తే తక్కువే. రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో సినిమా రూపొందించారనే విమర్శలు విశ్లేషకుల నుంచి రావడం కూడా సినిమా వసూళ్లపై ప్రభావం చూపాయని అంటున్నారు. ఈద్ రోజు విడుదలైన సల్మాన్ గత చిత్రాలు ‘భరత్’ రూ.42 కోట్లు, ‘సుల్తాన్’ రూ.36 కోట్లు, ‘ఏక్ థా టైగర్’ దాదాపు 33 కోట్ల రూపాయల వసూళ్లను తొలి రోజు ఆర్జించాయి.