సల్మాన్ఖాన్ హీరోగా సాజిత్ నడియాద్వాలా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కిక్’. 2014లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్లో బ్లాక్బాస్టర్గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురావడానికి సాజిత్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ఈ సీక్వెల్కి దర్శకుడు ఆయన కాదు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆ బాధ్యతను స్వీకరించినట్టు విశ్వసనీయ సమాచారం.
నిర్మాణంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను సాజిత్ నిర్వహిస్తారని తెలుస్తున్నది. మురుగదాస్ బృందం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఈ సీక్వెల్లో మళ్లీ దేవీలాల్సింగ్-డెవిల్గా సల్మాన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు బాలీవుడ్లో బలంగా వినిపిస్తున్నది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది ఈద్ పండుగ కానుకగా సినిమాను విడుదల చేయాలని సాజిత్ నడియాద్వాలా సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.