Sakshi Vaidhya | అదేంటో ఒక్కోసారి వరుసగా రెండు, మూడు సినిమాలు ప్లాప్ అయితే దర్శక, నిర్మాతలు ఆ హీరోయిన్ల వైపు కూడా చూడరు. అదే కొందరి విషయంలో మాత్రం ఫ్లాపులు ఎన్నొచ్చిన అవకాశాలు మాత్రం గుమ్మం దగ్గర వేయిట్ చేస్తూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే బాంబే బ్యూటీ సాక్షీ వైద్య. ఏజెంట్ మూవీతో ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి సాక్షీ సినిమాల్లోకి రావడమే యాదృచ్చికం. దర్శకుడు సురేందర్ రెడ్డి, సాక్షీ వైద్య ఇన్స్టా రీల్స్ చూసి ఆమెను ఆడిషన్కు పిలిచాడట. కట్ చేస్తే అఖిల్ పక్కన హీరోయిన్గా ఫిక్స్ చేశారు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. సాక్షీకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాలో చాన్స్ పట్టేసింది.
ఈమె దురదృష్టం ఏంటంటే ఈ సినిమా కూడా అల్ట్రా డిజాస్టర్గా మిగిలింది. ఇక సాక్షీ కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే.. టాలీవుడ్లో దుకాణం సర్దేసుకోవాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ వరించింది. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా సినిమాలో సాక్షీనే హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను తీసుకున్నా.. ప్రస్తుతం ఆమెకున్న బిజీ షెడ్యూల్లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. దాంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడదే ప్లేస్ను సాక్షీ వైద్య రీప్లేస్ చేసిందని ఇన్సైడ్ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ మాఫియా, డ్రగ్స్తో కలకళం సృష్టిస్తున్న రౌడీ మూకలను అంతమొందించే పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సెకండ్ పార్ట్ను కూడా ప్లాన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అందుకోసం క్లైమాక్స్లో ఓపెన్ ఎండింగ్ను ప్లాన్ చేస్తున్నారట. సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.