వి.జె సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘సకల గుణాభిరామ’. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. సంజీవరెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్లుక్ను ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం విడుదలచేసింది. వీజే సన్నీ మాట్లాడుతూ ‘సుశాంత్సింగ్రాజ్పుత్ ప్రేరణతో హీరోగా మారాను. నాలో స్ఫూర్తిని నింపిన ఆయన మరణం నన్ను ఎంతగానే కలిచివేసింది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సకల గుణాలు కలిగిన రాముడి లాంటి ఓ యువకుడి కథ ఇది. పెళ్లయిన అతడి జీవితంలోకి మరో అమ్మాయి ఎలా ప్రవేశించిందనేది వినోదాన్ని పంచుతుంది. భార్యాభర్తల అనుబంధానికి పెద్దపీట వేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని అన్నారు. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆషిమా నర్వాల్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.