వెంకటేశ్ 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆదివారం శ్రీలంకలో మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీతోపాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నామనీ, అలాగే ఓ పాటకు సంబంధించిన మాంటేజ్లు కూడా చిత్రీకరించడం జరుగుతుందని, వెంకటేశ్తోపాటు సినిమాలోని ముఖ్యతారాగణం మొత్తం ఈ షెడ్యూల్లో పాల్గొంటారని దర్శకుడు తెలిపారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీశర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్, ఎడిటర్: గ్యారీ బిహేచ్, నిర్మాణం: నిహారిక ఎంటర్టైన్మెంట్.