సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సాయి వెంకట్ మాట్లాడుతూ..‘రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. హైదరాబాద్, శ్రీరంగం, బెంగళూరు లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 15తేదీ నుంచి తిరుపతి, బెంగళూరులో మూడో షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నాం. రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుంది. మొదటి భాగం విజయదశమికి పండక్కి విడుదల చేయబోతున్నాం’అన్నారు.