టాలీవుడ్ (Tollywood) హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే కలుద్దాం అంటూ ఆస్పత్రి నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తో ఆనందంలో మునిగితేలుతున్నారు మెగా అభిమానులు. సాయిధరమ్ తేజ్ ఆస్ప్రత్రిలో చేరి దాదాపు నెల కావొస్తుంది. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత తొలిసారి థంబ్స్ అప్ సింబల్ ను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..తన ఆరోగ్యం కుదుట పడినట్టు స్పష్టత ఇచ్చాడు. దీంతో మరి సాయిధరమ్ తేజ్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొంటాడా..? లేదా..? సమయం పడుతుందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సాయిధరమ్ తేజ్ నవంబర్ నుంచే చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడట. మిస్టికల్ థ్రిల్లర్ గా రాబోతున్న చిత్ర షూటింగ్ లో నవంబర్ మొదటి వారం నుంచే పాల్గొంటాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. దేవాకట్టా డైరెక్షన్ లో సాయిధరమ్ నటించిన రిపబ్లిక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా..బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి