Sai Dharam Tej | ‘విరూపాక్ష’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు యువ హీరో సాయిధరమ్తేజ్. మేనమామ పవన్కల్యాణ్తో కలిసి ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్తేజ్ తన తదుపరి సినిమా కోసం ఆరు నెలల విరామాన్ని తీసుకోబోతున్నారని తెలిసింది.
‘బ్రో’ ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈలోగా తన శారీరక ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటానని, రాబోవు సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దన్నదే తన ఉద్దేశ్యమని సాయిధరమ్తేజ్ తెలిపారు. ‘చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. ఈసారి మరింత బలంగా తిరిగొస్తా. నేను సంపూర్ణంగా కోలుకోవడానికి ఈ ఆరునెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా’ అని సాయిధరమ్తేజ్ చెప్పారు.