సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకుడు. పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కామినేని శ్రీనివాస్ సమర్పకుడు. ఈ సినిమాలోని ‘వెళ్లిపోకే..’ అనే పాటను యువ దర్శకుడు, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘పాటతో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి పైడిపాటి మాట్లాడుతూ ‘విభిన్న కథా చిత్రమిది. నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఆమని, పృథ్వీ, ఆక్సాఖాన్, షమ్ము, అరుణ్వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దర్శన్, సంగీతం: రాప్ రాక్ షకీల్, కథ: నజీర్, మాటలు: పి.రాజేంద్రకుమార్, నజీర్, భవానీప్రసాద్, నిర్మాత: శివశంకర్ పైడిపాటి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్.