నాగమహేష్, రాజేంద్ర, సునీత, సురేష్ కొండేటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఆర్.కె. గాంధీ దర్శకుడు. కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గరాజు నిర్మిస్తున్నారు. త్వరలో అనంతపురంలో నాలుగో షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘సినీ కళాకారుల కథలు, వ్యథలతో రూపొందిస్తున్న చిత్రమిది. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో వారికి ఎదురయ్యే కష్టాలను రియలిస్టిక్గా సినిమాలో చూపించబోతున్నాం. మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అనంతపురంలో జరిగే నాలుగో షెడ్యూల్లోఓ పాట, ఫైట్ను చిత్రీకరిస్తాం’ అన్నారు. గాంధీ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాలో నటించానని సురేష్ కొండేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగమహేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.