రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా ప్రభావంతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీల గురించి చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేసింది. ఈ సినిమాను మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిపోయి..థియేటర్లన్నీ పూర్తి కెపాసిటీతో పనిచేస్తే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా రెండు తేదీలను వెల్లడించినట్లు పేర్కొన్నారు.