టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్లతో సినిమా చేస్తున్న కారణంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండడం సహజం. అయితే అటు చరణ్, తారక్ పాత్రలను తక్కువ చేయకుండా.. ఇటు కథను మార్చకుండా సినిమాను తెరకెక్కించామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
మరోవైపు రాజమౌళి ఈ సినిమా కథ మనకు తెలిసింది కాకుండా ఫిక్షన్ నేపథ్యంలో కొత్తగా తెరకెక్కించాం అని చెబుతూనే ఉన్నాడు. కాని ఓ నెటిజన్ 1920 లో స్వాతంత్ర్య సమరయోధులు ఇంటి నుండి వెళ్ళిపోయి రెండేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకున్నారని, కాబట్టి ఈ రెండేళ్ళల్లో ఏం జరిగిందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్ ని ఫిక్షన్ గా తెరకెక్కించాలని రాజమౌళి అనుకున్నాడు
మనకు తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపిస్తున్నారా అనేది డౌట్ అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి ఆర్ఆర్ఆర్ టీం ఫన్నీగా బదులు ఇచ్చింది. ‘ ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసీ హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది.
Ori Mee Dumpalu Thega…. Meeerekkada Dorikaaru ra… Director press meet petti cheppaaru kada clear ga… Meeku thelisina story edi kudaa cinema lo undadu. Mind lo nunchi avanni theesesi enjoy the euphoria and film!!
— RRR Movie (@RRRMovie) November 10, 2021