Rowdy boys | సంక్రాంతి పెద్ద సినిమాలు వెనకడుగు వేయడంతో.. ఉన్నట్టుండి తన సినిమాను ముందుకు తీసుకొచ్చాడు దిల్ రాజు. తన వారసుడు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ శ్రీ హర్ష దర్శకత్వంలో వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాను జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. దానికితోడు విడుదలకు ముందు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన వారసుడి కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని వాడేశాడు దిల్ రాజు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా ప్రతి ఒక్క హీరో ఆశిష్ రెడ్డి కోసం ముందుకొచ్చారు.
ఒకరు ట్రైలర్ విడుదల చేస్తే.. మరొకరు పాటలు విడుదల చేశారు. ఇంకొకరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇంత చేసిన తర్వాత ఈ సినిమాపై హైప్ రాకుండా ఎలా ఉంటుంది..? పైగా ట్రైలర్ కూడా బాగానే ఉండటంతో యూత్ రౌడీ బాయ్స్ కోసం బాగానే వెయిట్ చేశారు. అయితే విడుదలైన తర్వాత సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. పెద్దగా ఏం లేదు.. కాకపోతే కుర్రాడు బాగున్నాడు అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం తెలిపారు. మంచి సినిమా పడితే ఆశిష్ రెడ్డి ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుకుంటాడని అందరూ చెబుతున్న మాట.
రౌడీ బాయ్స్ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు.. వచ్చే కలెక్షన్స్ కు పెద్దగా పొంతన లేదు. వారసుడి కోసం భారీగానే ఖర్చు చేశాడు దిల్ రాజు. కానీ మొదటి రెండు రోజుల్లో కోటికి పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. బంగార్రాజు రూపంలో తీవ్రమైన పోటీ ఉండటంతో.. చిన్న సినిమాలపై ప్రభావం భారీగా పడుతుంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కెరీర్ లో మొదటి సారి చాలా బోల్డ్ పాత్రలో నటించింది ఈమె. అంతేకాదు సినిమాలో నాలుగైదు లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది అనుపమ. ఈమె గ్లామర్ కూడా సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఓవరాల్ గా దిల్ రాజు వారసుడు పాస్ మార్కులు వేయించుకున్నాడు.