Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చేది ‘రౌడీ బేబీ’ పాట. ‘మారి 2’ చిత్రంలోని ఈ పాటకు ప్రేక్షకుల ఫిదా అవ్వడంతో పాటు వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కెరీర్లో 55వ చిత్రంగా రాబోతున్న #D55 లో సాయిపల్లవి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్న చిత్రబృందం మరో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా.. సాయి పల్లవి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వం వహించబోతున్నాడు. ‘వండర్బార్ ఫిల్మ్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది.
She’s about grace and strength – all at once ❤️
Welcoming everybody’s favourite @Sai_Pallavi92 on board #D55. The hit combo returns to the big screen.@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr… pic.twitter.com/zycf0OiQKu
— Wunderbar Films (@wunderbarfilms) February 2, 2026