డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri jagannath) తన తనయుడిని నిలబెట్టేందుకు గట్టిగా కృషి చేస్తున్నాడు. పూరీ తనయుడు ఆకాశ్ పూరీ(Akash) నటించిన రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం గట్టిగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో రమ్య గొవార్కర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
గోవా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్యాంగ్స్టర్లు.. అందులోని ఓ కుర్రాడి ‘రొమాంటిక్’ ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, కథనం సంభాషణలు అందించారు.అయితే సినిమా విడుదలకి రెండు రోజుల ముందే పూరీ ప్రీమియర్ షో ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది.
ఏఎంబీ మాల్ లో జరిగిన ప్రీమియర్ షోకి రాజమౌళి, హరీష్ శంకర్, మెహర్ రమేష్, ఆలీ, ఉత్తేజ్, ఖయ్యూం, అనీల్ రావిపూడి, తేజస్వినితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 29న రొమాంటిక్ తోపాటుగా వరుడు కావలెను కూడా వస్తోంది. ఈ రెండింటి మధ్య మంచి పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.